ఆదివాసి కళాశాల కోసం ఉద్యమానికి సిద్ధం
*ఆదివాసి న్యాయ కళాశాల కోసం ఉద్యమానికి సిద్ధం*
*జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి*
ఆగస్టు 7 వెంకటాపురం తెలంగాణ వార్త:-
వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీలో గొండ్వాన సంక్షేమ పరిషత్ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ములుగు జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు పూనేం ప్రతాప్ అధ్యక్షతన వహించడం జరిగింది.ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనేం సాయి మాట్లాడుతూ.భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ.ఈ నెల 30 నుండి అన్ని మండల కేంద్రంలో ఒకరోజు ధర్నాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.భద్రాచలం కేంద్రంగా ఆదివాసి న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే, ఆదిమ తెగల భవిష్యత్తు బాగుంటుందని ఆయన అన్నారు.భద్రాచలం కేంద్రమైన చతిస్గడ్,ఒరిస్సా, సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం కేంద్రంలో ఆదివాసి విద్యార్థుల కోసం న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఆదివాసి చట్టాలపై ఆదివాసి హక్కులపై అవగాహన ఉంటుందని,ఆదివాసీల భూములకు ఆదివాసి యువతే రక్షణగా ఉంటున్నారని ఆయన అన్నారు.ఆగస్టు 9న ప్రతి ఆదివాసి గూడెంలో ప్రపంచ ఆదివాసులు దినోత్సవం అని ఘనంగా నిర్వహించుకోవాలని ఆదివాసి దినోత్సవాన్ని క్యాలెండర్లో రాయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో కొమరం భీమ్ కాలనీ ఆదివాసులు పాల్గొన్నారు.