మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, మరో పాతిక మందికి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఖండన
తెలంగాణ వార్త రిపోర్టర్ *మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, మరో పాతిక మందికి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఖండన* *ఫహల్గామ్ "ఉగ్రవాద" నేరస్తుల ఉనికిని సైతం పసిగట్టి శిక్షించలేని పాలకులు ఆదివాసీ, మావోయిస్టుల్ని హత్య చేసి గర్వంగా ప్రకటన ఇవ్వడం ఫాసిస్టు నీతికి నిదర్శనంగా పేర్కొన్న ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్!* *హత్యలతో విప్లవోద్యమాన్ని ఆపలేరని ప్రజాతంత్ర ఉద్యమకారుడు... కార్మిక వర్గ బోరపుత్రుడు.. శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ప్రకటన!* అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన "ఆపరేషన్ కగార్" నేడు హత్యాకాండకి బహిరంగ లైసెన్స్ ఇవ్వడం దారుణ చర్యగా బాధితుల బంధువు... భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జెకెఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ లో కేంద్ర సాయుధ బలగాల కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 25 మందికి పైగా మృతి చెందారు. ఒకవైపు శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్న సమయంలో ఇలాంటి దారుణనికి ఒడిగట్టడం ఫాసిస్టు నీతిని వెల్లడి చేస్తున్నది. ఆపరేషన్ కగార్ ఆపాలని మేధో వర్గాలు, ప్రజాతంత్ర వాదులు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర సర్కార్ ని కోరుతున్నా మోడీ, అమిత్ షాల ప్రభుత్వం స్పందించకపోగా తమ నరమేధాన్ని తీవ్రతరం చేసింది. అడవి నుండి ఆదివాసీలను ఖాళీ చేయించి, అంతిమంగా అడవి సంపదను బడా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఫహల్గామ్ "ఉగ్రదాడి" క్రూర నేరస్తుల నుండి పర్యాటకులకు భద్రత కల్పించడానికి, ఆ దాడి తర్వాత నేరసుల్ని బంధించి శిక్షించడానికి లేని శ్రద్ధ శాంతి చర్చల్ని కోరుతున్న మావోయిస్టు పార్టీ మీద కేంద్రీకరణ చేస్తున్న క్రూర విధానాన్ని తీవ్రంగా ఖండించాలని ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు ప్రజాతంత్ర ఉద్యమకారుడు కమ్యూనిస్టు విప్లవకారుడు, సామాజిక పరివర్తకుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జేయస్సార్ సార్ విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలు కోరుకుంటున్న నేరస్తుల్ని వదిలేసి, ఈ ఆపరేషన్ కగార్ కి ప్రాధాన్యత ఇవ్వడాన్ని నిరసించాలని కార్మిక వర్గ బో రా పుత్రుడు... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు.. స్వయం ప్రకటిత ఆదర్శ కమ్యూనిస్టు, అభ్యుదయ వాది అనగారిన ప్రజల హక్కుల కోసం మూడున్నర దశాబ్దాలుగా నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం తనవంతుగా కృషి చేస్తున్న ఉద్యమం నెలబాలుడు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ విజ్ఞప్తి . కగార్ ఆపరేషన్ ని వెంటనే ఆపాలనీ, సైనిక బలగాలను వెనక్కి రప్పించాలనీ, ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలనీ జనతంత్ర శ్రామిక రాజ్యం కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి దేవాన్ష్ బొరన్న జే కే ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు మరియు మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు జన తంత్ర శ్రామిక రాజ్యం కమ్యూనిస్టు పార్టీ సీపీఐ (ఎం-ఎల్) కార్యదర్శి, మానవతావాది, సమ సమాజ స్వప్నికుడు, సామాజిక దురాచారాలపై ప్రజా విముక్తి కోసం తనవంతుగా పోరాడుతున్న స్వయం ప్రకటిత ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు.. కార్మిక వర్గ బోరపుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... పీడిత ప్రజా ప్రేమికుడు... కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ విప్లవ జోహార్లు జోహార్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలూ, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని ప్రజా బంధువు.. కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ 9848540078, 8328277285 కోరారు. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కా. నంబల్ల కేశవ రావు @ బసవ రాజు కు విప్లవ జోహార్లు. 2018 నుండి ఈ రోజు ఎన్ కౌంటర్ లో మరణించే వరకు ఏడేళ్ళ పాటు కా. బిఆర్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. అప్పటి వరకు కా. బిఆర్ 2001 లో గత పీపుల్స్ వార్ పార్టీలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సిఎంసి) ఏర్పాటు చేసినప్పటి నుండి దానికి బాధ్యుడిగా ఉన్నాడు. 2004 లో సిపిఐ మావోయిస్టు ఏర్పడినప్పుడు కూడా సిఎంసి బాధ్యుడిగానూ, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తూ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు. 1973-74 లో ఆర్ఈసి లో పిప్లవ విద్యార్థిగా ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి వెనక్కు తిరిగి చూడలేదు. ఆయన వరంగల్ లో ఏబివిపి గూండా, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గా పోరాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. ఆర్ఈసి అంటే రాడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని పేరు తెచ్చుకోవడంలో ఆయనది కూడా గణనీయమైన పాత్ర. ఎమర్జెన్సీలో విప్లవకారులందరి మీద నిర్బంధం ప్రారంభం కావడంతో ఆయన అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుండి ఆయన ఇక వెనుతిరిగింది లేదు. వరంగల్ లోనే అజ్ఞాత జీవితం గడిపిన కాలంలో వరంగల్ హమాలీలను ఆర్గనైజ్ చేయడానికి ఆయన కొన్ని నెలల పాటి హమాలీగా పనిచేశాడు. 1980 లో అడవిలోకి దళాలను పంపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు పంపిన మొదటి దళానికి కమాండర్ గా గంగన్న పేరుతో ఆయన వెళ్ళాడు. ఆ తరువాత అంచలంచెలుగా దండకారణ్య ఉద్యమ నిర్మాణంలో ఆయన భాగమయ్యాడు. మొదట ఫారెస్ట్ లయజన్ కమిటీలో ఆ తరువాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలోకి ఎన్నుకోబడ్డాడు. ఆ తరువాత కొన్ని ఏళ్ల పాటు గంగన్న పేరుతోనే దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. 1986 లో ఒక సారి ఆయన ఒక అపాయింట్మెంట్ కు వెళితే ఆ విషయం తెలిసి ఆయనను పట్టుకోవడానికి ఎస్టిఎఫ్ పోలీసులు అక్కడ మాటు గాచి ఆయనను పట్టుకోగానే వారిని కొట్టి, వారిపై ఫైర్ చేసి అక్కడి నుండి తప్పుకున్నాడు. అప్పటి నుండి ఈ రోజు ఎన్ కౌంటర్ లో అమరుడయ్యే దాకా ఇక మరి పోలీసుల చేతికి చిక్క లేదు. భారత విప్లవోద్యమం సాధించిన అనేక సైనికపరమైన విజయాలకు సిఎంసి నాయకుడిగా ఆయన ప్రత్యక్ష సారధి. 1995 లో ఉన్నత సైనిక ఫార్మేషన్ లు ఏర్పాటు చేయడంలో, 2000 లో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ, 2004లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేయడంలో ఆయనది కూడా కీలక పాత్ర. ఈ గెరిల్లా ఆర్మీ కి కమాండర్ గా ఆయన ఏపి, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, దండకారణ్యమంతటా బలగాలకు శిక్షణ ఇవ్వడంలోనూ, సైనిక చర్యలలోనూ ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. భారత దేశంలో ఎన్నో సార్లు అనేక ఎంఎల్ పార్టీలు విలీనం అయినా, అనేక రాజకీయ సమస్యలతో పాటు, నాయకత్వ సమస్యలతో కూడా కొట్టుమిట్టాడి మళ్ళీ చీలికలకు గురి అయ్యాయి. కానీ పీపుల్స్ వార్, పార్టీ యూనిటీలు విలీనం అయిన తరువాత అయినా, పీపుల్స్ వార్, ఎంసిసిఐ లు విలీనం అయినప్పుడైనా – కింది స్థాయిలో కొన్ని ఒడిదుడుకులు, అనైక్యతలు ఉన్నా, కేంద్ర స్థాయిలో బలమైన ఐక్యత సాధించడంలో మిగిలిన నాయకత్వ కామ్రేడ్స్ తో పాటు కా. బిఆర్ ది కూడా చాలా గొప్ప పాత్ర ఉంది. దండకారణ్యంలో గెరిల్లా బేస్ లు ఏర్పాటు చేయాలని, ప్రజా రాజ్యాధికార సంస్థలను ఏర్పాటు చేయాలనే కీలక రాజకీయ నిర్ణయాలలో కా. బిఆర్ ఎంతో గొప్ప పాత్ర నిర్వహించాడు. విప్లవోద్యమం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో 65 ఏళ్ల వయసులో కా. బిఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. ఆ గడ్డు పరిస్తితి నుండి బయట పడటంలో పార్టీని ముందుకు నడిపించడానికి తన కొన ఊపిరి దాకా ఆ కామ్రేడ్ ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ విప్లవ గడ్డ మీద పోరాడుతూనే 72 ఏళ్ల వయసులో కా. బసవ రాజ్ అమరుడు అయ్యాడు. దోపిడీ పీడనలు లేని సమ సమాజాన్ని కాంక్షించి దాని స్థాపన కోసం యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా కృషి చేసిన కా. బసవ రాజ్ పీడితుల గుండెల్లో సదా నిలిచే ఉంటాడు. కా. చారు మజుందార్ తరువాత పోలీసుల చేతిలో అమరుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబల్ల కేశవ రావు కు విప్లవ జోహార్లు. ప్రభుత్వం నిజంగా శాంతికి కట్టుబడి ఉంటే, కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదా పారామిలిటరీ దళాలు, ఆధునిక ఆయుధాలతో ఈ విధమైన ఆపరేషన్లను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, ఇది అంతర్యుద్ధమని ప్రభుత్వం అంగీకరించాలి.పదుల సంఖ్యలో ఇలా చుట్టుముట్టి కాల్చి చంపడం ఆనవాయతిగా మారింది. ఇప్పటికే సంవత్సర కాలంలో 5000 మందిని చంపేశారు. అందులో అమాయకులు, సాధారణ ఆదివాసులు కూడా వున్నారు. ఈ నరమేధం ఆపాలని పౌర సమాజం నుండి ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ కోరారు. దేశ పౌరుల మీద, ప్రజల తరుపున నిలబడే వారిమీద అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా చేస్తున్నది. ప్రజా నేస్తం కామ్రేడ్ జెకెఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ విజ్ఞప్తిని, శాంతియుత చర్చలకు సిద్ధం అన్న మావోయిస్టు పార్టీ ప్రత్తిపాదనను కనీసం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఫాషిస్ట్ విధానాన్నే అమలు జరుపుతున్నది. ఇప్పటికైనా మధ్య భారతంలో జరిగే నరమేధాన్ని ఆపాలి. రక్తపు టేరులతో, పచ్చటి అడవిని, ఆదివాసి ప్రాంతాలను ధ్వంసం చేయవద్దు. ఆదానీ, అంబానీ, ఇతర విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీల ధన దాహం కోసం బీజేపీ సర్కార్ ప్రజలను, ప్రజా నాయకులను చంపడం ఆపాలి. మొత్తం ఎన్కౌంటర్ హత్యలపై సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకొని న్యాయ విచారణ జరపాలని కమ్యూనిస్టు పార్టీ సీపీఐ (ఎం.ఎల్) కార్యదర్శి కార్మిక వర్గ బోరపుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నకుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ డిమాండ్ చేశారు