270 ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో మహా కుంభాభిషేకం""కేరళ

తెలంగాణ వార్త ప్రతినిధి : 270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం
కేరళ : భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ముఖ్యమైన ఆలయం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు శయన స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే 270 ఏళ్ల తర్వాత ఆ ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు విష్ణు నామ స్మరణతో మారుమోగాయి. అలాగే ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునః: ప్రతిష్ఠించారు.