పీడీఎస్ బియ్యం పట్టివేత
తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం కన్నారెడ్డికుంట తండా మరియు చుట్టుప్రక్కల తండాల ప్రజలనుండి మోసపూరిత మాటలు చెప్పి తక్కువ ధరకు ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యమును కొనుగోలు చేసి ఎక్కువ దరకు కోళ్ళ పారంలకి అమ్ముటకు తరలిస్తున్న వ్యక్తులను పట్టుబడి చేసి వారి వద్దనుండి 13 బస్తాలు 5 క్వింటాల రేషన్ బియ్యం మరియు బియ్యం తరలించడానికి ఉపయోగించిన ఆటొ ను సీజ్ చేయనైయనది, ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ గౌడ్ విలేకరుల సమావేశంలో పిడిస్ బియ్యం ఖయావిక్రయాలు జరిపినచో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు