పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ

Mar 30, 2024 - 21:22
Mar 30, 2024 - 21:31
 0  8
పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ
పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ
పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ

హైదరాబాద్,, 30 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను పీఆర్సీ కమిటీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా అంధ ఉపాధ్యాయ, ఉద్యోగుల అవసరాలు, సమస్యలను పీఆర్సీ కమిటీకి అసోసియేషన్ నేతలు వివరించారు. ఈ చర్చల్లో ప్రధానంగా కన్వీనియన్స్ అలవెన్స్, రీడర్ అలవెన్స్, అదనంగా 4 సాధారణ సెలవులు కల్పించాలని కోరారు. బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున రాష్ట్ర అధ్యక్షుడు కె.మల్లేశం, ప్రధాన కార్యదర్శి బి.రాఘవేందర్ రెడ్డి, కె.అనిల్ కుమార్, ఎన్.రవీందర్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333