ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Aug 15, 2024 - 19:25
Aug 15, 2024 - 20:38
 0  16
ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఇందారపు రాజమల్లయ్య జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపనతో జెండావందనం చేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఇందారపు రాజమల్లయ్య మాట్లాడుతూ.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ. సమాన్యుడి అభివృద్దె లక్ష్యంగా, ఉచిత విద్యా, వైద్యం అంతర్జాతీయ స్థాయిలో అందిస్తూ..అనతికాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న NDA ప్రభుత్వం అణచి వేయాలని కుట్రలు చేస్తుందని, ఆప్ జాతీయ కన్వీనర్  అరవింద్ కెజ్రీవాల్ ని, తీహార్ జైలులో హత్యచేసే కుట్రలు జరుగుతున్నాయని, బీపీ, షుగర్ లకు హై డోస్ మెడిసిన్ ఇచ్చి చంపాలని ప్లాన్ చేస్తున్నారని, స్వాతంత్ర్య సమరయోధులు, జైళ్ళను, ప్రాణాలను లెక్క చేయలేదని, అదే దారిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తన్నీర్ వెంకన్న, రింగ్ ఐసయ్య, జిల్లాకార్యదర్శి మారగాని సైదులు, జిల్లా జాయింట్ సెక్రటరీ సుంచు నరసింహ పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223