ప్రజలకు జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు

Jul 25, 2024 - 18:55
Jul 25, 2024 - 18:59
 0  43
ప్రజలకు జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు

ఏపీలో ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

దామోదర్ రాజా నరసింహ కి వినతి పత్రం అందజేసిన 

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు . 

జోగులాంబ గద్వాల 25 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి.అలంపూర్. నియోజకవర్గంలోని ప్రజలు జర్నలిస్టులు ఉద్యోగస్తులకు ఏపీలోని కర్నూల్ లో ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మరియు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ కి ఎమ్మెల్యే  వినతి పత్రం అందజేశారు.మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ అశోక్ రెడ్డి,పుల్లూరు రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State