ఆటోను ఢీకొన్న లారీ, ఒకరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు

Aug 15, 2024 - 19:26
 0  19
ఆటోను ఢీకొన్న లారీ, ఒకరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు

జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఉండవెల్లి: లో  ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముందు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో లక్ష్మీదేవి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ దవాఖానకు108 హైవే అంబులెన్స్ ద్వారా తరలించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా తాండ్రపాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి రోజు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333