దశదిన కర్మ కు పద్మశాలి కమిటీ యువత సాయం

దశదిన కర్మలకు పద్మశాలి కమిటీ యువత సాయం
- పినపాక తెలంగాణ వార్త :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం ఉప్పాక గ్రామంలోని కుంజా పుల్లయ్య అనారోగ్యంతో మరణించడం జరిగినది. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలి యువజన సంఘం తరఫున 25 కేజీల బియ్యం 2500 నగదు ఇవ్వడం జరిగింది. అనంతరం పద్మశాలి యువత పుల్లయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో పద్మశాలి కమిటీ యువత పాల్గొన్నారు.