నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల బంగార్రాజు

Sep 5, 2024 - 10:50
 0  76
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బిజెపి మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల బంగార్రాజు

 వరి పత్తి మిర్చి పెసర పంటలు మరియు నిమ్మ తోటల . రైతుల రైతుల నష్టం... 

ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి... 

రైతులను ఆదుకోవాలి పంట నష్టపరిహారం చెల్లించాలి.. 

తిరుమలగిరి 05 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

గత రెండు రోజులుగా తిరుమలగిరి మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా వివిధ గ్రామాల లో వందలాది ఎకరాలలో వరి పంట నీట మునిగిందని, గ్రామాలలో ఇల్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని బిజెపి మండల పార్టీ అధ్యక్షులు వేల్పుల బంగార్రాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుమలగిరి మండల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల మూలంగా అనేక చెరువులు, కుంటలు అలుగు పోయడం వరద బీభత్సం వల్ల నాటు పెట్టిన వరి పొలాలు మొత్తం కొట్టుకపోవడంతో రైతులుతీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రెవిన్యూ, వ్యవసాయ అధికారులువెంటనే గ్రామాలలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ప్రభుత్వం వారికి . ఇల్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అలాగే నిత్యవసర వస్తువులు, వంట సరుకులు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034