గొడ్డలితో నరికి చంపిన దుండగులు

Apr 9, 2025 - 12:01
Apr 9, 2025 - 19:51
 0  4
గొడ్డలితో నరికి చంపిన దుండగులు
గొడ్డలితో నరికి చంపిన దుండగులు

గొడ్డలితో నరికి చంపిన దుండగులు

వాజేడు, ఏప్రిల్ 9 తెలంగాణ వార్త  : ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వాసం విజయ్ (28) ని గుర్తుతెలియని దుండగులు తలపై గొడ్డలితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండార్ కుమార్, పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్