ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి తుంగతుర్తి రవి

May 22, 2024 - 20:44
 0  206
ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి తుంగతుర్తి రవి

తిరుమలగిరి 23 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలలో పట్టభద్రుల యువతతో  పిర్జాదిగూడ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి మాట్లాడుతూ నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  తీన్మార్ మల్లన్న ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొరినారు తీన్మార్ మల్లన్న ను గెలిపించి చట్టసభలలోకి పంపిస్తే మన గొంతుకై వినిపిస్తాడు నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడతారు మన సమస్యను పరిష్కార దిశగా ఆలోచించగల దిటైన నాయకత్వం కలిగిన నాయకుడు మన మల్లన్న అని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గడిల పరిపాలనకు వ్యతిరేకంగా కెసిఆర్ కేటీఆర్ లను ముచ్చమటలు పట్టించి గడియ తలుపులు బద్దలు కొట్టే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎక్కుపెట్టిన నాయకుడు మన తీన్మార్ మల్లన్న అని అలాంటి నాయకత్వం కలిగిన నాయకుడని చట్టసభలకు పంపించి మన గొంతుకను వినిపించుకుందాం.. ఇండియా కూటమి బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఎంపిటిసి జుమ్మిలాల్ కృష్ణ నాయక్ వంశీ  కాంగ్రెస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034