వెల్దేవి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ 

Apr 18, 2024 - 18:52
 0  68
వెల్దేవి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ 
వెల్దేవి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ 

అడ్డగూడూర్ 18 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని గురువారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ గౌడ కులస్తులు, గ్రామస్తుల సమక్షంలో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమానికి మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజ నిర్వహించారు.


     ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామస్తులు ఐకమత్యంతో శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గౌండ్ల కులస్తులు కలిసికట్టుగా ఉండడం అభినందనీయం అన్నారు. అనుకున్నట్టుగానే ఆలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూదాతలు తీపిరెడ్డి కరుణాకర్ రెడ్డి తండ్రి ఇంద్రసేనారెడ్డి, తీపిరెడ్డి మల్లారెడ్డి తండ్రి పిచ్చిరెడ్డి గౌడ కులస్తులు భూదాతలను సన్మానించారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333