ఫిబ్రవరి 12 న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వాములం అవుదాం గ్రామపంచాయతీ వర్కర్స్& యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు

Feb 10, 2026 - 20:57
 0  1
ఫిబ్రవరి 12 న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వాములం అవుదాం  గ్రామపంచాయతీ వర్కర్స్& యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఫిబ్రవరి 12 న జరిగే సార్వత్రిక సమ్మెలో భాగస్వాములం అవుదాం గ్రామపంచాయతీ వర్కర్స్& యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కార్మిక సంఘాల జేఏసీ 2026 ఫిబ్రవరి 12న ఇచ్చిన సార్వత్రిక సమ్మెలోమండలం లోని అందరు గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ &యూనియన్ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు కార్మికులకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు (s)మండలం కేంద్రం లో గ్రామపంచాయతీ కార్మికుల సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ సర్కార్ గత ఆరు సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల అమలుకు కుట్ర చేస్తుందని, అయిన కార్మికుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గుతూ, తిరిగి 2026 ఏప్రిల్ ఒకటి తేదీన నాలుగు లేబర్ కోడ్ల అమలుకు ప్రయత్నం చేస్తుందని, కార్మికులు ఐక్యంగా వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించి, శాలువాలు కప్పి సన్మానాలు చేస్తే సరిపోదని, సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేసి, కార్మికులకు మోడీ సర్కార్ అండగా నిలవాలని దాసు కోరారు. ప్రతి ఏటా రెండు కోట్ల కొలువుల మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దేశంలో 50 కోట్ల మందిలో, 43 కోట్ల మందికి పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంపదను కార్పొరేట్ పంపినలకు దారాదత్తం చేయకుండా, ప్రజలకు చెందేటట్లు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస పెన్షన్ 9 వేల రూపాయలు ప్రకటించి అమలు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని దాసు డిమాండ్ చేశారు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే పతనం కాక తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు మనుషులే అన్న విషయాన్ని మర్చిపోకుండా, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోమండల ప్రధాన కార్యదర్శి కలకోట్ల మాల్సుర్ మండల ఉపాధ్యక్షులు రాలు నాగమ్మ, కోశాధికారి మాతంగి నాగయ్య, పబ్బతి వెంకటేష్ సీనియర్ నాయకులు బొడ్డు పీటర్, నీలం అశోక్ తదితరులు పాల్గొన్నారు