గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సీఐ 

Sep 9, 2024 - 19:14
 0  49
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సీఐ 
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సీఐ 

నాగారం సెప్టెంబర్ 9 తెలంగాణ వార్త:- గణేష్ నవరాత్రి ఉత్సవాలను అందరూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు. సోమవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి ఆనంద్ గార్డెన్లో గణేష్ ఉత్సవాల శాంతి కమిటీ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గణేష్ విగ్రహాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీలను ఆదేశించారు. మండపాల వద్ద విద్యుత్ కలెక్షన్ల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీ జే లు సౌండ్ బాక్స్ లు ఏర్పాటు చేసినట్లయితే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీవో ధారా శ్రీనివాస్ ఎస్ఐ ఐలయ్య వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సామాజిక నాయకులు ఉత్సవ కమిటీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333