వాహనాల  తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 4,73,500/- రూపాయలు  సీజ్

Apr 4, 2024 - 19:25
 0  14
వాహనాల  తనిఖీల్లో  ఏలాంటి రశీదులు లేని 4,73,500/- రూపాయలు  సీజ్

జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ ల పరిధిలో, సరి హద్దు చెక్ పోస్టు లలో పోలీస్ అధికారులు విస్తృతంగా  వాహనాల తనిఖీలు చేపట్టి 4,73,500/- రూపాయలను సీజ్ చేసి  జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటి కి అప్పగించినట్లు  జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS   తెలిపారు.

   ఈ రోజు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గట్టు పోలీస్ స్టేషన్  పరిధిలో ఏలాంటి రశీదులు లేని 2,76,000/- రూపాయలను ఉండవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లూరు  చెక్ పోస్టు నందు 1,97,500/-  రూపాయలను సీజ్ (మొత్తం 4,73,500/- రూపాయలు) చేసి జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి పోలీస్ అధికారులు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయల కొద్దీ ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే  తగిన రశీదులు ,పత్రాలు  వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333