మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న పలిమార్ పీఠాధిపతి

Apr 4, 2024 - 19:29
 0  9
మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న పలిమార్ పీఠాధిపతి
మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న పలిమార్ పీఠాధిపతి

జోగులాంబ గద్వాల 4 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఉడిపి పలిమర్ పీఠాధిపతులు శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ గురువారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం బీచ్పల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టలకు హాజరైన స్వామీజీ సాయంత్రం మల్లకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకోగా వారికి ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు భక్తులు ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ వేద పాఠశాల సందర్శించి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, మద్వేష, బాబురావు, నాగరాజు శర్మ, వెంకోబా రావు, చంద్రశేఖర రావు, చంద్రశేఖర్ రెడ్డి, నరేందర్, మధు,బాదామి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333