ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన

అడ్డగూడూరు బీజేవైఎం మండల అధ్యక్షులు గోలి సుమన్ 

Feb 21, 2024 - 19:45
Feb 21, 2024 - 19:48
 0  11
ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన

అడ్డగూడూరు 21 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొని.. బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అడ్డగూడురు మండల పరిధిలో బీజేపీ అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని వివరించగా మరింతగా కష్టపడాలని, శ్రమించే వారికి పార్టీ అగ్రనాయకత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరిపై కాషాయ జెండా ఎగురవేయాలని, తెలంగాణలో భవిష్యత్తు మొత్తం బీజేపీదే అని చెబుతూ.. వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆప్యాయంగా పలకరించి, మాలో ఉత్సాహాన్ని నింపిన ఈటల రాజేందర్ కు గోలి సుమన్ ధన్యవాదాలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333