శ్రావణ మంగళవారం సందర్భంగా విశేష పూజలు
ప్రత్యేక అలంకారణలో విజయాంజనేయ స్వామి
రామనామస్మరణతో మారుమ్రోగిన దేవాలయం
సూర్యాపేట 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీ విజయాంజనేయ స్వామి దేవాలయం నందు శ్రావణమాసం రెండోవ మంగళవారాన్ని పుష్కరించుకొని ఆలయ అర్చకులు మరింగంటి వరదా చార్యులు విశేష పూజలు చేసారు.ఉదయం స్వామివారికి ఆరాధన పంచామృత అభిషేకం తదుపరి అలంకరణ అష్టోత్తర శతనామావళి నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
భక్తులు రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ అర్చకులు వరదాచార్యులు మాట్లాడుతూ పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన విజయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారు భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ ఉద్భవించారని ప్రతి ఒక్కరికి విజయాన్ని చేకూర్చే విధంగా స్వామివారి అనుగ్రహం అందరిపై చూపుతారని సకల కార్యసిద్ధికి శ్రీ విజయాంజనేయ స్వామి వారికి 11 రోజులు 11 ప్రదక్షిణలు చొప్పున కంకణం ధరించి దీక్ష చేసినట్లయితే సత్వరమే దీర్ఘకాలిక కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి.శ్రావణమాసంలో ఈ ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యలు కమిటి అధ్యక్షులు మండల్ రెడ్డి వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి నాగవేళ్ళి దశరద కోశాధికారి యలమద్ది అశోక్ ఉపాధ్యక్షులు పోతుగంటి రామారావు కమిటీ సభ్యులు లింగారెడ్డి రజిత ఆవుల వెంకన్న మనెమ్మ సురేందర్ మంజుల మనసాని రాంమూర్తి తదుతర భక్తులు పాల్గొన్నారు.