రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయం.
జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు.
రైతును రాజు చేసి దేశాన్ని సుభిక్షంగా ఉంచే పౌరుడిగా పౌరురాలుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు జెడి ఫౌండేషన్ చైర్మన్ మరియు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు భద్రాచలం జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం కి శివారు ప్రాంతంలో ఉన్న పురుషోత్తపట్నం గ్రామం నందు ఏరువాక పున్నమి సందర్భంగా ఘనంగా రైతులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జెడి ఫౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏరువాక పున్నమిని పురస్కరించుకొని జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల కౌలు రైతులని సన్మానించడం అనే కార్యక్రమం ద్వారా రైతు నీ గౌరవించడం మరియు సాంప్రదాయాలను పాటించడంలో జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ హన్సి మాట్లాడుతూ ఎటువంటి హాలిడే లేని ఏకైక వ్యక్తి రైతని అటువంటి రైతన్న నీ సన్మానించడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పురుషోత్తపట్నం చెందిన రైతులు.. వాసుదేవరాయ, కృష్ణయ్య, బాలస్వామి, వెంకయ్య, వీరస్వామి, కోటేశ్వరమ్మ కి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు సునీత ,యూసుఫ్ మియా, కడాలి నాగరాజు పాల్గొన్నారు.