నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

చర్ల 6- 8- 2025 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో రైతు వేదిక ఆఫీస్ నందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందుతాయని రేషన్ కార్డులు పంపిణీ నిరంతర ప్రక్రియ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఈ రేషన్ కార్డు వల్ల సన్న బియ్యం పొందడమే కాకుండా ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఈ రేషన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు చర్ల మండలంలోని ప్రజలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన అర్హులకు . స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చర్ల ఎండిఓ ఈదయ్య, ఎంపివో వలీ హజ్రత్, సివిల్ సప్లయ్ డిటి రాజులు, ఏపిఎం లక్ష్మి దుర్గ మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు...