ఎర్రబోరు గ్రామంలో వైద్య శిబిరం

తేదీ 6- 8 -2025 : చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఎర్రబోరు గ్రామంలో డాక్టర్ దివ్య నాయన గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మరియు పాఠశాలలోని పిల్లలకు వైద్య పరీక్షలు చెయ్యడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్ యందు సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది గర్భిణీ స్త్రీలను ప్రతి నెల పరీక్షలు కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావాలని సురక్షితమైన సుఖప్రసవం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా రావలెను అని చెప్పడం జరిగింది అనంతరం గృహ సందర్శనలు చేసి డ్రై డే కార్యక్రమాలు చెయ్యడం జరిగింది అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని దోమ తెరలను వినియోగించుకోవలని ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని నిల్వ ఉన్న నీళ్లలో టేమోపాస్ ద్రావణాన్ని చల్లాలని ఆశా కార్యకర్తకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్య నాయన మెడికెల్ ఆఫీసర్ బాబురావు హెచ్ ఈ ఓ సంధ్య ఎమ్ హెల్ హెచ్ పి వరప్రసాద్ హెల్త్ అసిస్టెంట్ ఆశా కార్యకర్త భూలక్ష్మి పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గోనడం జరిగింది