ఘనంగా తీకుళ్ల సాయి రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ

Jul 21, 2024 - 21:47
Jul 21, 2024 - 22:09
 0  41
ఘనంగా తీకుళ్ల సాయి రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ

ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

 సూర్యాపేట 22 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆచరించే ద్దాంతాలు వేరయినప్పటికి ఒకరి నొకరు గౌరవించే సంప్రదాయం సూర్యాపేట లో ఎల్లప్పుడూ వుంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు  గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ  జిల్లా లో 37 సంవత్సరాల పాటు  ఉపాధ్యాయులుగా సేవలు అందించిన జాతీయ వాది, పూర్వ ఎబివిపి నాయకులు, ఆపస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు అయిన తీకుళ్ల సాయి రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తీకుళ్ల సాయి రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులుగా పనిచేసి విద్యార్దులలో దేశభక్తి భావజాలం పెంపొందించారని అన్నారు.  వారు తన పదవీ విరమణ తరువాత కూడ తాను నమ్మిన బాటలో పయనించి దేశ సేవ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తీకుళ్ల సాయి రెడ్డి మాట్లాడుతూ తాను ఇంతకాలం జాతీయ వాదంతో పనిచేశానని, ఇక ముందు కూడ సంఘం ఆదేశాల మేరకు ఏ భాధ్యత ఇచ్చినా పనిచేస్తానని అన్నారు.
అనంతరం ఉపాధ్యాయులు సాయి రెడ్డి ని శాలువాలతో సన్మానించారు. 
 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాంచందర్ రావు, మురళీ మనోహర్ రావు, మట్టపల్లి రాధాకృష్ణ, బెల్లంకొండ రామ్మూర్తి,  పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333