వైభవంగా శ్రీ తిమ్మప్ప స్వామి కల్యాణం

Jul 21, 2024 - 21:41
Jul 21, 2024 - 22:02
 0  4
వైభవంగా శ్రీ తిమ్మప్ప స్వామి కల్యాణం
వైభవంగా శ్రీ తిమ్మప్ప స్వామి కల్యాణం

జోగులాంబ గద్వాల 22 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. మల్దకల్.ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణం చేయించిన దాతలు రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన పవిత్ర వంశీధర్ రెడ్డిగారు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణం వేడుకలను పలువురు భక్తులు తిలకించారు. అనంతరం శ్రీమతి పుణ్యవతి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేయించి ప్రారంభించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State