దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ జమ్ములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానం , ( జమ్మిచేడు) హుండీ లెక్కింపు
జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల తేది:31-10-2025 శుక్రవారం రోజున దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు శ్రీమతి వెంకటేశ్వరి గారు, ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ.ఆర్.పురేందర్ కుమార్ , మరియు చైర్మన్ ఎం.సి.వెంకట్రాములు , మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, యూనియన్ బ్యాంకు మేనేజర్ ,సిబ్బంది గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా ఇట్టి *"హుండీ లెక్కింపు" కార్యక్రమం యందు 3 నెలలకు గాను మొత్తం హుండీ ఆదాయం రూ"9,78,159 /- అక్షరాల తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒక్క వంద యాభై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చినదని ఇట్టి హుండీ లెక్కింపు యందు వెండి, బంగారం ఏమియు రాలేదని తెలియచేయనైనది…. ఆర్.పురేందర్ కుమార్ కార్యనిర్వాహణాధికారి మరియు ఎం. సి.వెంకట్రాములు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. వారు తెలియజేశారు.