ఏటూరునాగారంలో ఘోర రోడ్డు ప్రమాదం
**ఏటూరునాగారంలో ఘోర రోడ్డు ప్రమాదం*-
బ్రేకింగ్ న్యూస్:-
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. జాతీయ రహదారి 163పై పెట్రోల్ బంక్ సమీపంలో కారు, భారీ క్రేను ఒక్కసారిగా ఢీకొన్నాయి. ప్రమాదంలో రెండు వాహనాలు లోయలోకి దూసుకెళ్లాయి. కారులోని డ్రైవర్ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లో క్షతగాత్రులను ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.