ఆధార్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా తంగళ్ళమూడి శ్రీనివాసరావు.. 

Oct 15, 2024 - 20:30
 0  0
ఆధార్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా తంగళ్ళమూడి శ్రీనివాసరావు.. 

జిల్లాలో తొలి అభ్యర్థిని  ప్రకటించిన చైర్మన్ కంటే కేశవ గౌడ్.పార్టీలో బీసీలకు తొలి ప్రాధాన్యం.. 

 ఆధార్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా తంగళ్ళమూడి శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ గౌడ్ మంగళవారం ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామపంచాయతీకి చెందిన వాసిని అధికారికంగా ప్రకటించారు.  బీసీ సామాజిక వర్గంలో రజక కులానికి చెందిన శ్రీనివాసరావుకు తొలి టిక్కెట్ ఇచ్చి బీసీలకు  మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కేశవ్ గౌడ్ మాట్లాడుతూ తమ పార్టీలో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలకు సైతం పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బీసీ నినాదమే ధ్యేయంగా తమ పార్టీ పనిచేస్తుందని, వాటితో పాటు అన్ని వర్గాల ప్రజలకు జిల్లాలో చోటు కల్పిస్తామని వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ గణన పూర్తయిన వెంటనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. పార్టీ జిల్లాలో చాప కింద నీరుల విస్తరిస్తుందని, పార్టీలో చేరిన వారికి టికెట్లలో ప్రాధాన్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధార్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంబాజీ బుడ్డయ్య. ఈడ నాగ పుల్లారావు తల్లాడ వెంకటేశ్వర్లు. వూకే.ముత్తయ్యదోర.పూనః.నరేషే.నూప. శ్రీరామ్. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు.కుక్కల నాగేశ్వరరావు గౌడ్. గ్రామస్తులునాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333