ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం:జిల్లా అదనపు కలెక్టర్

Jun 24, 2024 - 20:42
 0  12
ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కారం:జిల్లా అదనపు కలెక్టర్

జోగులాంబ గద్వాల 24 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన  ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ముసిని వెంకటేశ్వరులు అధికారులకు సూచించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 45 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని అయన 
తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే జాప్యం లేకుండా జిల్లా అధికారులు పరిష్కరించాలని అయన అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన 45 దరఖాస్తులలో  2 ఆసరా పెన్షన్లు, 3 ధరణి సమస్యలతో పాటు ఇతర శాఖలకు సంబంధించినవి 40 ఆర్జీలు అందాయని  ఆయన తెలిపారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333