ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కలెక్టర్ బీఎం సంతోష్

Sep 30, 2024 - 19:15
 0  4
ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కలెక్టర్ బీఎం సంతోష్

జోగులాంబ గద్వాల 30 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను త్వరగా పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, నర్సింగరావు, ఆర్డిఓ రాంచందర్ లతో కలిసి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333