పోలీసుల అదుపులో పల్లపు రజని కుమార్ ఇసుక ట్రాక్టర్లు..

Oct 17, 2024 - 17:46
 0  2
పోలీసుల అదుపులో పల్లపు రజని కుమార్ ఇసుక ట్రాక్టర్లు..

సూర్యాపేట రూరల్ : సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయినిగూడెం గ్రామానికి చెందిన పల్లపు రజని కుమార్ ఇసుక ట్రాక్టర్లను రూరల్ పోలీస్ స్టేషన్ కు తరించినట్లు సమాచారం. గత కొంత కాలంగా అక్రమ ఇసుక వ్యాపారం సాగిస్తున్న రజనీ కుమార్ ను పోలీసులు పలుమార్లు హెచ్చరించినా ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం కోసాగిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామంలో డంప్ లు ఏర్పాటు చేసి మైనర్ డ్రైవర్లతో పరిమితికి మించిన వేగంతో ట్రాక్టర్ల ను నడిపిస్తూ పలు ప్రమాదాలకు రజని కుమార్ కారణమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, రెవిన్యూ అధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన ట్రాక్టర్లకు అడ్డు ఉండదని యదేచ్ఛగా ఇసుక తరలిస్తున్నట్లు పలువురు గ్రామస్తులు చెపుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333