పట్టపగలే ఉపాధీ హామీ పథకం కింద నాటిన చెట్లను - కొక్లైన్ తో నరికి వేసిన టోపీ వెంకటన్న
జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని - దాసరిపల్లి గ్రామస్తులు డిమాండ్
జోగులాంబ గద్వాల 5మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉపాధి హామీ పథకం క్రింద దాసరపల్లి గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించారు.చెట్లు ఇదే గ్రామానికి చెందిన మొద్దుల వ్యాపారి టోపీ వెంకటన్న సోమవారం ఉదయంవ్10 గంటల సమయంలో అధికారులకు తెలియకుండగా దౌర్జన్యంగా ప్రోక్లైన్ తో పట్టపగలే చెట్లను నరికి వేయడం పట్ల గ్రామస్తులు మండిపడ్డారు.ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చెట్లను నరికి వేసిన టోపీ వెంకటన్న పై చర్య తీసుకొని ప్రొక్లైన్ ను స్వాధీనపరచుకోవాలని దాసరపల్లి గ్రామస్తులు నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.