నిరంతరం ప్రజాసేవకై పరితపించే వ్యక్తులపై నిందలు వేయడం సరికాదు.. సీనియర్ నాయకులు రాయపూడి

Sep 17, 2024 - 18:46
Sep 17, 2024 - 20:34
 0  114
నిరంతరం ప్రజాసేవకై పరితపించే వ్యక్తులపై నిందలు వేయడం సరికాదు.. సీనియర్ నాయకులు రాయపూడి

నిరంతరం ప్రజా సేవకై పరితపించే వ్యక్తులపై నిందలు వేయడం సరికాదు...

తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకట నారాయణ 

కోదాడ, సెప్టెంబర్ 17

నిరంతరం ప్రజా సేవకై పరితపించే ఉత్తమ్ దంపతులపై నిందలు వేయడం సరికాదని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదలపై ఉత్తమ కుమార్ రెడ్డి పంట నష్టం అంచనాపేసి రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. నడగూడెంలో సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చేందుకు యుద్ధపాతి ప్రతికన పనులు చేయిస్తున్నారని, దానికోసమే రెండుసార్లు నడిగూడెం మండలంలో పర్యటించారని అది రైతులపై అనుకున్న ప్రేమను తెలియజేస్తుందన్నారు. ఉత్తమ్ దంపతులు ఆకాశంలో విహారయాత్రలు చేస్తున్నారని మాట్లాడటం తగదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అధికారం దుర్వినియోగం చేసావు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముందర ఒక పోలీసు వాహనం కుయ్ కుయ్మంటూ తిరగటం ఎవరికి తెలియంది కాదు. ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఫ్లెక్సీలు డీజేలు పెట్టుకొని ఊరేగిన విషయం తెలియదా కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం మీరు ఆరోపణలు చేస్తున్నారే తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కోదాడ నియోజకవర్గం ప్రజలను నోరు కొట్టి సంపాదించిన సొమ్ములో కనీసం వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ అయినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మాట్లాడటం సరికాదు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు లబ్ధిదారుల విషయంలో ఎంత కమిషన్ తీసుకున్నారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. అంతా అవినీతి చేసిన నిజాయితీగల మొత్తం కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. మరోసారి ఇలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State