తెలంగాణలో నేటి నుండి ఒంటి పూట బడి 

Mar 15, 2024 - 18:59
Mar 15, 2024 - 19:47
 0  2
తెలంగాణలో నేటి నుండి ఒంటి పూట బడి 

హైదరాబాద్:రాష్ట్రంలో ఎండలు తీవ్ర మవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించ నున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్ప కుండా ఒంటిపూట బడు లను అమలులోకి తీసుకు రావాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333