తక్కశిలా, ఉండవెల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను సందర్శించిన
జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్ :-
జోగులాంబ గద్వాల 17 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- గద్వాల. జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము క్యాథూర్ మరియు మానవపాడు పరిధిలో ఏఎన్ఎం స్క్రీనింగ్ రికార్డులను శ్యాంసుందర్ తనిఖీ చేశారు... ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో వివరాలను సరిగ్గా నమోదు చేయాలని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లను ఎన్సిడి పోర్టల్ నందు లింక్ చేసి స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. నెలనెలా టార్గెట్ పూర్తి చేయాలని మరియు క్వాలిటీ స్క్రీనింగ్ జరగాలని ఏఎన్ఎంలకు మరియు ఆశా కార్యకర్తలకు సూచించారు.... మరియు బీపీ షుగర్ ఉన్న వారికి నెలనెలా పరీక్షలు నిర్వహించి మందులు మందులు పంపిణీ చేయాలని ఇది నిరంతర ప్రక్రియగా భావించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్వో ఎస్ టి ఎస్ రమేష్ ,MLHP మరియు ఏఎన్ఎం వినోదిని, పాల్గొన్నారు.