విద్యుత్ రైతులకు,ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ 5 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రోజు చర్లపల్లి డివిజన్ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా స్థానికులు సబ్ స్టేషన్ కొరత కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, చర్లపల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.