జోగులాంబ ఆలయంలో భక్తులకు భద్రత కరువైంది
జోగులాంబ గద్వాల 5 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ జోగులాంబ ఆలయంలో భక్తుల కు భద్రత కరువైంది. భక్తుల ముసుగులో కొంతమంది దొంగలు భక్తులపరసు డబ్బులు సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారు. ఆలయ సిబ్బంది వీఐపీల సేవలో తరిస్తున్నారు. ఇంత రద్దీ రోజు ఆలయాన్ని పర్యవేక్షించాల్సిన ఈవో దీప్తి రెడ్డి అందుబాటులో లేరు. బయట వాహనాలు రద్దీ పెరగడంతో క్యూ లైన్ లో భక్తి రద్దీ పెరగడంతో పోలీసులు కష్టపడి భక్తులను క్రమబద్ధీకరిస్తూ దర్శనాలకు పంపిస్తున్నారు. ఆదాయం ఆలయానికి కష్టం పోలీసులకు అన్నట్టు మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి ఇలాంటి సమస్యలు పునరావతం కాకూడదని వివిధ ప్రాంతాల భక్తులు కోరుతున్నారు.