అమ్మవారిని శంఖం బరే దేవిగా అలంకరణ.

Jul 19, 2024 - 20:41
Jul 19, 2024 - 20:42
 0  23

జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  శాంతినగర్ గ్రామంలో వెలసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని 19వ తేదీ శుక్రవారం అమ్మవారిని శాకంబరే దేవిగా అలంకరించడం జరిగినది. ప్రాత కాలం నుంచి అమ్మవారికి అభిషేక కార్యక్రమం తదనంతరం అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లతో అలంకరించడం జరిగినది . ఈ అలంకారం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించడం జరుగుతుంది. ఉదయం మరియు సాయంకాలము మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మహిళలందరూ కలిసి సామూహిక కుంకుమార్చన మరియు లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగినది.

 మహా మంగళహారతి తదనంతరం ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వితరణలు ఏర్పాటు చేశారు పై కార్యక్రమాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ రావూరి సురేష్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరు లు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State