ఘోర రోడ్డు ప్రమాదం లారీ- బస్సు ఢీ  8 మంది మృతి  మరో 25 మందికి గాయాలు 

Sep 13, 2024 - 19:15
 0  3
ఘోర రోడ్డు ప్రమాదం  లారీ- బస్సు ఢీ  8 మంది మృతి  మరో 25 మందికి గాయాలు 

* బంగారుపాళ్యం మండలం  మొగిలి గ్రామం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
*  చిత్తూరు వైపు నుంచి  వస్తున్న అలిపిరి డిపో ఆర్టీసీ బస్సు, ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 
* గాయపడ్డ వారిని బంగారుపాళ్యం, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..

* ఐరన్ లోడుతో వస్తున్న లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, దాంతో రోడ్డుకు అడ్డదిడ్డంగా వస్తున్న ఆ వాహనాన్ని  ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు  ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగినట్టు  పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
*  జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలాన్ని చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333