చెట్టు మీద పడి వ్యక్తి మృతి
మద్దిరాల 29 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తుఫాన్ భారీ వర్షం వల్ల ప్రాణం తీసిన చెట్టు..
గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది..
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చందుపట్లలో విషాదం నెలకొన్నది వివరాలకు వెళితే మద్దిరాల మండలానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) తానంచర్ల నుండి మద్దిరాల వరకు ద్విచక్ర వాహనంపై మెడికల్ షాపు కు వెళ్తుండగా చందుపట్ల ఊరు చివరన కొత్త పాఠశాల దగ్గర చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె గలదు దీంతో గ్రామంలోని విషాదఛాయలు అలుముకున్నాయి...