భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి ప్రయత్నాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తుంది

బి ఆంజనేయులు సిపిఐ జిల్లా కార్యదర్శి.
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పై ఓ న్యాయవాది చెప్పు విసిరిన సంఘటనను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జోగులాంబ గద్వాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోంది.
ఇది ఒక వ్యక్తి తప్పుడు ప్రవర్తన మాత్రమే కాదు, ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాలకు చెందిన కుడిపక్ష శక్తులు పెంచిపోషిస్తున్న అసహన సంస్కృతిక ప్రతీక. రాజ్యాంగ సంస్థలను అవమానపరచడం, న్యాయవ్యవస్థను బెదిరించడం లక్ష్యంగా చేసిన ముందస్తు ప్రణాళికతో కూడిన దాడి ప్రయత్నం ఇది.
సిపిఐ అభిప్రాయం ప్రకారం, న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఒక స్వతంత్ర స్తంభం. న్యాయమూర్తులపై దాడి చేయడం అంటే రాజ్యాంగంపై దాడి చేయడం.రాజ్యాంగం పై దాడి చేయడమంటే దేశం పైన దాడి చేయడమే వుతుంది. ఈదేశ ప్రజలు ప్రజాస్వామ్య శక్తులందరూ న్యాయవ్యవస్థ గౌరవం, స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత చూడాలి.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని, దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం, సంస్థాగత ప్రోత్సాహం వెలికితీయాలని బి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ మరియు కాంటెంప్ట్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలి.
రాజ్యాంగ విలువలను కాపాడటానికి, ద్వేషం మరియు బెదిరింపుల రాజకీయాలను ఎదుర్కోవడానికి, సామ్యవాది, ప్రజాస్వామ్య శక్తులందరూ ఐక్యంగా ముందుకు రావాలి అని సిపిఐ పిలుపునిస్తుంది.
బి ఆంజనేయులు
బారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)
జోగులాంబ గద్వాల