అధికారుల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం... మండల పాస్టర్స్ ఫెలోషిప్

Feb 22, 2024 - 18:42
Feb 23, 2024 - 20:03
 0  3
అధికారుల క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం... మండల పాస్టర్స్ ఫెలోషిప్

మునగాల 22 ఫిబ్రవరి 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

దేశ క్షేమం కోసం, మండల అధికారుల క్షేమం కోసం అనునిత్యం ప్రార్ధిస్తున్నామని మునగాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆంజనేయులును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంజిరెడ్డిని బొకే, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బిషప్, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ పాస్టర్ జె. సుదర్శనం మాట్లాడుతూ, దేశంలోని అధికారుల, ప్రజల క్షేమం కోసం నిరంతరం ప్రార్ధిస్తూ, ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని హితువు పలికారు. మండలంలోని పాస్టర్లు అందరూ కలిసి మండల అధికారులు నాయకులు ప్రజల క్షేమం కోసం అనుదినం ప్రార్థిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మండల పాస్టర్లకు తహసిల్దార్ ఆంజనేయులు, ఎస్సై అంజిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా యూత్ కన్వీనర్ జె.జె.సామ్యూల్ సన్, కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జె. లూకా, కోదాడ నియోజకవర్గ కోర్ కమిటీ సభ్యులు ఆర్. ప్రకాష్, మండల అధ్యక్షులు సీ.హెచ్ ఆదాము, కోశాధికారి కె. జాషువారాజు, వసంత్ కుమార్, మహేష్ పాల్, ఒబద్యా, అబ్రహాం రాజు, మండల సామాజిక కార్యకర్త గంధం సైదులు తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State