నీలిపల్లిలో ఘనంగా ముగిసిన విగ్రహ ప్రతిష్టలు
జోగులాంబ గద్వాల 8 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలో శ్రీజములమ్మ పరశురాముల అమ్మవారి యొక్క విగ్రహప్రతిష్టాపన కార్యక్రమంలో మంగళవారం దిగ్విజయంగా ముగిశాయి. ఉదయం 6 గంటలకు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మహోత్సవము సహస్ర అధిక విగ్రహ ప్రతిష్టాపన చారి రమేష్ ఆచారి ఆధ్వర్యంలో జరిగాయి. మంగళవారం ఉదయం జమ్ములమ్మ అమ్మవారి ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమం లో వేద పండితులు శ్రీనివాసమూర్తి , ప్రసన్నచారులు, ప్రద్యుమ్న, హర్ష అయ్యయొక్క బృందం చేత ఈ మూడు రోజులు కార్యక్రమం జరిగింది. ఇవన్నీ భగవత్ అనుగ్రహం చేత కేవలం 120 రోజుల్లో దేవాలయం నిర్మాణం చేసి ప్రతిష్టాపన ఇక్కడ మరియు నడిపించినారు. గ్రామంలో ఉన్న పెద్దలు,గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.