గుర్తు తెలియని వ్యక్తి మృతి.

Apr 1, 2024 - 17:42
 0  5
గుర్తు తెలియని వ్యక్తి మృతి.

జోగులాంబ గద్వాల 31 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో గద్వాల రైల్వే స్టేషన్ లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై నేపాల్ దేశానికి చెందిన రాజు రామ్ దగౌరా వయసు 40 సంవత్సరాలు అనే వ్యక్తి బెంచ్ పక్కన పడుకున్న చోటనే మృతి చెందినాడు. అతను గుండెపోటు కారణంగానే  మృతి చెంది ఉండవచ్చును అతని వద్ద ఉన్న చీటీ లో వ్రాసిన  సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులను విచారించగా అతను తేది 23-3-2024 నాడు  నేపాల్ నుండి జీవనోపాధి గురించి బెంగళూరు కు వచ్చినట్టుగా తెలిసినది. మృతునికి భార్య రత్న ఇద్దరు కుమారులు కలరు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరచడమైనది. G. రామకృష్ణ రైల్వే హెడ్ కానిస్టేబుల్ గద్వాల్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333