*సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు*

Mar 15, 2024 - 21:21
 0  3
*సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు*

తుంగతుర్తి మార్చి 15: తెలంగాణ వార్త ప్రతినిధి

తుంగతుర్తి మండలంలోని శుక్రవారం నాడు ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం జరిగింది, ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి గుండగాని కవితారాములు గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో వేసవికాలంలో నీటి సమస్యలు రాకుండా అధికారులు చూసుకోవాలి అని ఆదేశించారు. 

ముఖ్య అతిథి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి గుజ్జ దీపికా యుగంధర్ రావు గారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో రానున్న వేసవికాలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, నీటి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశమునకు హాజరుకాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

డిసిసిబి, డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఎంపిడివో శేషుకుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో రాబోయే వేసవికాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో అన్ని శాఖల అధికారులతో కలిసి మండలంలోని సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమణారెడ్డి, ఎంపిటిసిలు, ప్రభుత్వ శాఖల మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.