శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
సూర్యాపేట:- హనుమంతుని పూజించిన వారికి ఎటువంటి కష్టాలు వుండవని, శ్రీ రామ నామం జపించిన కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుందని 16 వ వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేంద్ర అన్నారు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ రామ్ నగర్ నందు గల శ్రీ విజయాంజనేయ ఆలయం నందు హనుమాన్ జయంతి ఉత్సవాలలో వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామి కి ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి కి తమలపాకులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో హనుమాన్ వైభవంపై అధ్యాపకులు , ప్రవచన కర్త వెంకటేశ్వర్లు చేసిన ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సలిగంటి సరిత వీరేంద్ర, ఆలయ కమిటీ చైర్మన్ మండల రెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొని భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నాగవెళ్లి దశరధ, నాగవెల్లి ప్రభాకర్, కోశాధికారి యలమర్తి అశోక్ కుమార్, పలువురు వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.