శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దర్శనానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కి స్వాగతం పలికిన. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Dec 23, 2025 - 16:08
 0  39

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి .

జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.   

జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

 జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అలంపూర్  మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ఐదవ శక్తిపీఠం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దర్శనానికి విచ్చేసిన గవర్నర్ కి తెలంగాణ హరిత హోటల్ నందు స్వాగతం పలకడం జరిగింది. హరిత హోటల్ నందు పోలీసు వారి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించడం జరిగినది. అనంతరం గవర్నర్  వెంట శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానంకు వెళ్లిన వారికి ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభంతో  స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333