శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్
జోగులాంబ గద్వాల 20 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల నడిగడ్డ భక్తుల ఇలవేల్పు జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని నూతన గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో పురందర కుమార్ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ వెంకట్ రాములు సిబ్బంది పాల్గొన్నారు.