నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

Jun 10, 2025 - 21:45
 0  1
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి పాతర్లపాడు బస్ స్టేజి వద్ద సిసిఎస్ పోలీసు మరియు ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం గా ఉన్న వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కు చెందిన A2 తండా నగేష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగినది. ఇతను 120 ప్యాకెట్లు కలిగిన నకిలీ విత్తనాల గోనెసంచిని బండి పై పెట్టుకొని వెళుతుండగా అదుపులోకి తీసుకున్నాము. ఇతని విచారించగా ఇతడు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన A3 నిందితుడు పంది రాముల వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ విత్తనాలు రైతులను మోసం చేసి గడ్డి మందు తట్టుకునేదని, అధిక దిగుబడిని ఇచ్చేవి అని రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి A2 తండా నగేష్ ఒప్పుకోలు ప్రకారం A3 నిందితుడు పంది రాములను అతని గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగినది ఇతని వద్ద 120 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాము. A3 నిందితునికి ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న A4 బానోతు జయరాం అతని స్వగ్రామం NTR కృష్ణా జిల్లా మైలవరం లో విత్తనాల దుకాణం షాప్ ఉన్నది, A4 దుకాణం వద్దకు గుంటూరు టౌన్ బాలాజీనగర్ కు చెంది A5 నిందితుడు తరిగొప్పల శ్రీనివాసరావు రగా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బస్తాలో ఒక్కొక్క దానిలో 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు కలవు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విత్తనాలు సుమారు 63 లక్షలు రూపాయలు. ఈ విత్తనాలు జిల్లా మొత్తంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు వీరిని అదుపులోకి తీసుకుని విత్తనాలు రైతులకు చేరకుండా చేశాము. ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన A1 మాగులూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పల్లిపాడుకు చెందిన A6 చెవుల నరసింహులు పరారీలో ఉన్నారు. A1 సాంబశివరావు MD గా వ్యవహరిస్తు అరుణోదయ అనే విత్తన కంపెనీ నిర్వహిస్తున్నాడు, ఈ కంపెనీ నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగినది. వీరి ఇరువురిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తాము., ఆత్మకూర్ యస్ SI శ్రీకాంత్, మరియు సిబ్బంది