విజయం సాధించిన వాళ్లు అనుకున్న మెజారిటీ రాలేదు ఎందుకని...?

Feb 14, 2026 - 21:50
Feb 14, 2026 - 21:54
 0  0

ఓటమి చెందిన వాళ్లు ఇలా ఎందుకు జరిగిందని...?

పోస్టుమార్టమ్...!!!

క్యాంపు రాజకీయాల జోరు.... పార్టీల విప్ ఆదేశాలు జారి...!

✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మెజార్టీ తనకు ఎందుకు తగ్గిందా అని, ఓటమి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తాము ఎందుకు ఓటమి చెందామా అని తర్జనభర్జనలు పడుతూ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. విజయం సాధించిన, ఓటమి చెందిన అభ్యర్థులే కాకుండా ఇంకా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొంత మెజార్టీ తగ్గిందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామపంచాయతీ ఎన్నికలు తదితరు ఎన్నికలలో తమ పార్టీ స్థాయి ఎందుకు ఇలా తగ్గిపోయిందని బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా గణనీయంగా అన్ని ఎన్నికలలో కూడా బిజెపి అనుకున్న స్థాయిలో సీట్లను దక్కించుకోలేక పోయిందని బిజెపి అంతర్ మదనం చెందుతుండగా, ఇంకా సిపిఎం, సిపిఐ, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ, జనసేన, స్వతంత్రులు కూడా తమకు తగిన స్థాయిలో విజయం అందలేదన్న విషయంలో చర్చోప చర్చలు సాగిస్తున్నారు. ముఖ్యంగా అనూహ్యంగా సీట్లను గెలుచుకోలేక పోయినా బీ ఆర్ఎస్, బిజెపిలు తీవ్ర అంతర్మదనం చెందుతూ ఏ ప్రాంతాల్లో ఏవిధంగా వెనకబడ్డామో అన్న విషయాలపై దృష్టి సారించి స్థానిక నాయకత్వంపై చర్చించి కారణాలను అన్వేషిస్తున్నారు. ఇంతకుముందు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పనిచేసినవారు మళ్లీ ఈసారి పోటీలో ఉండటంతో ఆయా ప్రాంతాలను అనుకుని స్థాయిలో అభివృద్ధి చేయకపోవడం వలన ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమై ఎదురుగాలి వీచిందని అంచనాలకు వస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా పోటీలో ఉన్నవారు ఆయా ప్రాంత ప్రజలతో పరిచయం లేకపోవడం రాజకీయంగా అనుభవం లేకపోవడం స్థానిక సమస్యలపై పట్టు లేకపోవడం తదితరుల కారణాలవల్ల గెలుపు సాధించలేకపోయారనే విషయం అవగతమైనట్లు తెలుస్తుంది. 

జోరుగా మద్యం, మటన్, మనీ పంపిణీ... అయినా ఓడిపోయాం ఎందుకని...?

ప్రజాస్వామ్యంలో ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటును తనకు నచ్చిన వారికి మంచి అభ్యర్థికి వేస్తే ప్రజాస్వామ్యం పరిడ విల్లినట్లు అవుతుంది. అయితే ఏ ఎన్నికలైనా మద్యం, మనీ, మటన్, చికెన్, చీర సారెలు, ఇతర బహుమతులు, తాయిలాలు పంచనిదే పోటీ చేసిన అభ్యర్థులు గెలవని పరిస్థితులు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో నెలకొన్నాయి. ఈసారి కూడా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జోరుగా ఓటర్లను పలు రకాలుగా ప్రలోభ పెట్టి డబ్బులు,మద్యం పంపిణీలు ఏరులై పారాయి. అయితే ఓట్ల కోసం తాయిలాలు అందించినప్పటికీ కూడా పలువురు అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎవరైనా తమ పోటీ చేసిన ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల అందరికీ డబ్బు మద్యం పూర్తిస్థాయిలో అందించలేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యం, కేవలం ఉన్న ఓటర్లలో 50 నుంచి 80 శాతం మందికి మాత్రమే డబ్బు, మద్యం పంపిణీ చేశారని, ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే అన్ని రకాలుగా తాయిలాలు అందించారని, బహుమతులు అందుకున్న వారిలో అందరు కూడా ఓటు వేయలేదని, డబ్బు, మద్యం అందనివారు ఓటు వేయడం వలననే ఎక్కువ మంది అభ్యర్థులు ఓడిపోయారని ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అర్థమవుతుంది. దేనికి తోడు పోటీ చేసిన అభ్యర్థి అన్ని రకాలుగా అర్హుడు అయినప్పటికీ వారు పోటీ చేసిన పార్టీ విధానాలు నచ్చక మరి కొందరు ఓట్లు వేయలేదని తెలుస్తుంది. మరికొందరు అభ్యర్థులు కోపతాపాలకు,ఆవేశాలకు లోనై అనర్ధాల పాలయ్యారని, ఓటర్లను తక్కువ అంచనా వేసి చులకన గా చూడటం వలన కోట్లు రాబట్టుకోలేకపోయారని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొందరు ప్రచారం ఘనంగా నిర్వహించినప్పటికీ, భారీ ఎత్తున ర్యాలీలు తీసినప్పటికీ, హోటల్లో నుంచి స్పందన బాగానే వచ్చినప్పటికీ తీరా ఓటు వరకు వచ్చేసరికి సరేనా పోల్ మేనేజ్మెంట్ లేక ఓట్లు సరిగా తమకే పడేలా పరిస్థితులను చక్కదిద్దుకోలేకపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

క్యాంపు రాజకీయాలతో ఎన్నికల ఫలితాలు రాకముందే ముందే కూసిన కోయిలలు... ఫలితాల్లో తలకిందులై మౌనమునులను తలపించిన వేళ...!

గెలిచిన అభ్యర్థులు క్యాంపులలో... విప్ ల జారీకి పార్టీల వ్యూహాలు...!!

కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 12 తారీకు జరగగా అంతకుముందే రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులను తీసుకొని క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అయితే శుక్రవారం వెలువడిన ఫలితాలలో తాము ఊహించిన దానికి భిన్నంగా జరిగి అనుకున్న స్థాయిలో ఫలితాలు రాక ఓటమి దిశగా పయనించడంతో "తొందరపడి ఓ కోయిల ముందే కూసింది..." అన్నట్టుగా ఫలితాల్లో చతికిలబడి పరువు పోగొట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే మెజార్టీ స్థానాలు సంపాదించిన రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కకౌన్సిలర్లను, కౌన్సిలర్లను ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి. సోమవారం మేయర్, ఉపమేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఇలా ఎన్నిక జరగనున్నడంతో ఆయా పార్టీల నాయకులు తమ తమ పార్టీలో తరఫున గెలిచిన అభ్యర్థులు చేజారి పోకుండా పార్టీ తరఫున విప్ జారీ చేయడానికి సనహాలు చేస్తున్నారు. విప్ జారీ చేయడం ద్వారా మెజార్టీ కార్పొరేషన్ లు, చైర్మన్ స్థానాలు దక్కించుకోవాలని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. మొత్తానికి ఎన్ని రోజులుగా విజయం కోసం కాలికి బలపం తిరిగిన నాయకులు, గెలిచిన అభ్యర్థులు క్యాంపులలో రెండు రోజులుగా విశ్రాంతి పొందుతూ, సంతోషంగా గడుపుతూ సేద తీరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333