రామాపురం గ్రామంలో వానదేవుని కోసం పూజలు

జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి. మండలం రామాపురం గ్రామంలో నిన్నటి రోజు గ్రామస్తులు వరుణ దేవుడి కోసం పూజలు నిర్వహించారు.
ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రమైన బీచుపల్లి సమీపంలో గల కృష్ణానది నుంచి కాడెద్దులతో నదీ జలాలు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మేళ తాళాలతో భాజా భజంత్రీలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆ నదీ జలాలను ఉభయ రామ లింగేశ్వర ఆలయంలో గల శివలింగాలకు సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడిపంటలతో వెలసిల్లాలని ప్రార్థిస్తూ అభిషేకం చేశారు .
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.